వాషింగ్టన్ : భారత్-పాక్ మధ్య అణు యుద్ధం సహా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను కనుక తాను ఆపకపోయి ఉంటే 3.5 కోట్ల మంది ప్రజలు మరణించి ఉండే వారని పాక్ ప్రధాని షరీఫ్ తనతో పేర్కొన్నారని తెలిపారు.
అధ్యక్షుడిగా తన రెండో పర్యాయంలో మొదటి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో తాను సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిస్ట్-ఇథియోపియా తదితర దేశాల మధ్య సంక్షోభాలను కూడా పరిష్కరించినట్టు చెప్పారు.