వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మెక్క్లయిన్ కౌంటీ ప్రాంతంలో టోర్నడోల ధాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. భీకర గాలులకు కొన్ని భవనాల పైకప్పులు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం అత్యవసర నిర్వహణ సంస్థల సిబ్బంది గాలింపు చేపట్టారు. గాయాలైన పలువురిని దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.