కాబూల్ : ఆప్ఘనిస్ధాన్లోని హెరత్ గుజర్గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో ప్రముఖ మత గురువు ముజిబురుల్ రెహ్మాన్ అన్సారీ మరణించారు. ఈ పేలుడులో 20 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల సమయంలో పేలుడు జరిగినట్టు సమాచారం. గత రెండు దశాబ్ధాలుగా పాశ్చాత్య దేశాల వెన్నుదన్ను కలిగిన ఆప్ఘాన్ ప్రభుత్వాల విమర్శకుడిగా అన్సారీ పేరొందారు.
ఆప్ఘనిస్దాన్లో విదేశీ సేనల ఉపసంహరణతో 2021లో ఆప్ఘన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు అన్సారీ అత్యంత సన్నిహితుడు. అన్సారీ మృతిని తాలిబన్ ప్రతనిధి జబీహుల్లా ముజహిద్ ధ్రువీకరించారు. కాగా ఈ పేలుడుకు తామే బాధ్యులమంటూ ఇప్పటివరకూ ఏ సంస్ధ, వ్యక్తులు ప్రకటించలేదు.