లండన్, మే 25: 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఖడ్గం భారీ ధరకు అమ్ముడుపోయింది. లండన్లోని బోన్హమ్స్ ఇస్లామిక్ ఆండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేయగా 1.40 కోట్ల పౌండ్లకు అమ్ముడుపోయింది.
భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.143 కోట్లు. ఈ ఖడ్గం 15 లక్షల నుంచి 20 లక్షల పౌండ్ల వరకు పలకొచ్చని అంచనా వేయగా దాదాపు 10 రెట్లు ఎక్కువ ధర పలికింది.