రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయేట్టుగా లేదు. ఓవైపు తాత్కాలికంగా రష్యా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. రష్యా సేనలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే సుమీ అనే ప్రాంతంలో ఎయిర్ స్ట్రయిక్స్తో రష్యా విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్కు నార్త్లో చెర్నిగివ్ అనే రీజియన్లో ఓ కారు కింద యాంటీ పర్సనల్ మైన్(లాండ్మైన్) ను పెట్టి పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఇటువంటి మైన్ను ఉపయోగించలేదు. తొలిసారి ఈ మైన్ను కారు కింద అమర్చారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఉక్రెయిన్ పౌరుల మీద యాంటీ పర్సనల్ మైన్స్ను ఉపయోగించడం చట్టవిరుద్ధం అని ఉక్రెయిన్ అంబుడ్స్మెన్ డెనిసోవా వెల్లడించారు.