శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ఈవీఎంల వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈవీఎంల కన్నా పేపర్ బ్యాలెట్ మేలని నొక్కి చెప్పారు.
‘ఈవీఎంలు, మెయిల్ చేసిన ఏ విషయమైనా చాలా రిస్క్తో కూడుకున్నది. మనం పేపర్ బ్యాలెట్నే అనుసరించాలి’ అని మంగళవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విషయానికి మద్దతుగా ఈవీఎంల గురించి కొన్ని అమెరికా వార్తా కథనాలను జత చేశారు.