మెల్బోర్న్: మధుమేహ రోగులు గ్లూకోజ్ నిల్వల నియంత్రణ కోసం నొప్పి కలిగించే సూది మందు వేసుకొనే అవసరాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ పరిశోధకులు ఇందుకోసం కృత్రిమ క్లోమ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందుకు ఫైటో ైగ్లెకోజెన్ నానో కణాలను ఉపయోగించారు. ఇది రోగుల రక్తంలో గ్లూకోజ్ నిల్వలను కచ్చితంగా గుర్తించి అవసరమైన స్థాయిలో ఇన్సులిన్ విడుదల చేస్తుంది.
ప్రస్తుత విధానాల ప్రకారం మధుమేహ రోగులు రోజుకు అయిదుసార్లు ఇన్సులిన్ను సూది ద్వారా తీసుకోవాల్సి వస్తున్నది. తమ ఆవిష్కరణ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రోజుకు కేవలం రెండు సార్లు ఇంజెక్షన్ వేసుకొంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.