దుబాయి, మే 30: భారత్లో రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గల్ఫ్లోని నగదు మార్పిడీ కేంద్రాలు, కార్యాలయాలు రూ.2,000 నోట్లను తీసుకొని గల్ఫ్ కరెన్సీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
రూ.2,000 నోట్లను తీసుకోవద్దని తమ యాజమాన్యాలు ఆదేశించాయని, తాము తీసుకోలేమని సిబ్బంది తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు వచ్చేవారు రూ.2 వేలు కాకుండా 500 నోట్లను తెచ్చుకోవాలని అక్కడి భారతీయులు సూచిస్తున్నారు.