లండన్, ఫిబ్రవరి 10: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో బ్రిటన్కు నిరుద్యోగులను తరలించి బానిసలుగా మారుస్తున్న ఉదంతం సంచలనం కలిగిస్తున్నది. కేరళకు చెందిన ఐదుగురు వ్యక్తులు భారత్ నుంచి యువకులను ఇక్కడకు తీసుకువచ్చి తాము నిర్వహిస్తున్న కేర్హోమ్లలో బానిసలను చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. నార్త్వేల్స్లోని సంరక్షణ గృహాల్లో 50 మంది భారత విద్యార్థులు బాధితులుగా ఉన్నట్టు తెలుస్త్తుంది. బాధితులెవరైనా ఉంటే సహాయం, కౌన్సిలింగ్ కోసం వెంటనే తమను సంప్రదించాలని లండన్లో ఉన్న భారత హై కమిషన్ సూచించింది. నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.