ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. (terrorist attack). కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ సంఘటనలో 11 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్కు సరిహద్దులో ఉన్న పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి ఉత్తర వజీరిస్థాన్ గిరిజన జిల్లాలోని గుల్ మీర్ కోట్ సమీపంలో రోడ్డు పక్కన పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు అమర్చారు. 16 మంది కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆ పేలుడు పదార్థాలతో పేల్చివేశారు.
కాగా, ఈ దాడిలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ కూలీలంతా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్నారని చెప్పారు. మృతదేహాలతోపాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ ఈ దాడిని ఖండించారు
మరోవైపు ఈ సంఘటనకు ముందు శనివారం ఎగువ దక్షిణ వజీరిస్థాన్లోని మాకిన్ ప్రాంతంలో
బాంబు నిర్వీర్య స్క్వాడ్ వాహనంపై దుండగులు రాకెట్తో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ
వాహనంలోని నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.