47 మంది మృతి, 70 మందికి గాయాలు
కాబూల్, అక్టోబర్ 16: అఫ్గానిస్థాన్లో వారంలోనే మరో మారణహోమం సంభవించింది. కాందహార్ ప్రావిన్స్లో ఓ షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 47 మంది పౌరులు మరణించారు. 70 మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన స్థానికులతో మసీదు కిక్కిరిసి ఉన్న సమయంలో సూసైడ్ బాంబర్లు దాడి చేశారు. మసీదు లోపల, బయట రెండుచొప్పున పేలుళ్లు సంభవించినట్టు చెబుతున్నారు. గత శుక్రవారం ఉత్తర అఫ్గానిస్థాన్లోని ఓ షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి తామే చేశామని ఐసిస్ ప్రకటించింది.