Terror attack | ఇరాక్లోని కిర్కుక్ నగరంలో ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. దాదాపు 10 నెలల అనంతరం ఇరాన్లో మరోసారి తుపాకులు మోగడంతో కిర్కుక్ నగర వాసులు భయపడిపోతున్నారు.
ఇరాక్లోని కిర్కుక్ నగరానికి సమీపంలోని చెక్పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికులు కూడా కాల్పులు జరిపారు. కాగా, ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బాంబులతో దాడులు జరిపిన ఉగ్రవాదులు సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు, కమ్యునికేషన్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
దాదాపు 10 నెలల క్రితం జనవరిలో కూడా ఇదే తరహా దాడి జరిగింది. క్యూబా నగరంలోని అల్-అజీమ్ జిల్లాలోని బ్యారక్లను ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. నిద్రిస్తున్న సైనికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో ఓ గార్డుతోపాటు 11 మంది సైనికులు మరణించారు. కాగా, 2016 జూలై నెలలో ఇరాక్ రాజధాని బాగ్దాద్పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 200 మందికి పైగా మరణించారు.