భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15న అఫ్ఘాన్ గడ్డపై కూడా జాతీయ సెలవు దినం ప్రకటించింది తాలిబాన్ ప్రభుత్వం. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. గతేడాది ఆగస్టు 15న అమెరికా దళాలు అఫ్ఘాన్ను వీడాయి. అదే సమయంలో తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించారు. తాలిబాన్ల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది కాబూల్ ఎయిర్పోర్టుకు దూసుకెళ్లారు.
అక్కడి నుంచి అమెరికా వెళ్లే విమానాలు ఎక్కేందుకు నానా కష్టాలూ పడ్డారు. కొందరు విమానం రెక్కలు పట్టుకొని వెళ్లే ప్రయత్నం చేసి కింద పడిపోయి చనిపోయారు కూడా. ఇవన్నీ జరుగుతున్న సమయానికి అఫ్ఘానిస్తాన్.. తాలిబన్ల వశమైంది. దీనికి గుర్తుగానే సోమవారం నాడు జాతీయ సెలవు దినంగా ప్రకటించింది తాలిబన్ ప్రభుత్వం.