కొవిడ్-19 ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. టీకాలు వచ్చేవరకు ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నది. కొవిడ్ టీకాలు వచ్చాక ప్రాణనష్టం తప్పింది. అయితే, వ్యాక్సిన్లు కరోనాను పూర్తిగా అడ్డుకోలేవని, రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవారికి కూడా కరోనా వచ్చే అవకాశముందని యూకే పరిశోధకుల అధ్యయంలో తేలింది. కొవిడ్ 19తో మీ తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం లేదా చనిపోయే ప్రమాదాన్ని తగ్గించడంలో టీకా సహాయపడుతుందని పరిశోధనలో గుర్తించారు. అయితే, ఇది ఇన్ఫెక్షన్ను ఆపలేదని కనుగొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండ్ ఎపిడెమియాలజీ జర్నల్, యూరో సర్వెలెన్స్లో ప్రచురితమతమయ్యాయి.
ఈ పరిశోధనను నార్వేలో నిర్వహించారు. నవంబర్ 2021లో ఒమిక్రాన్ వ్యాపిస్తున్న సమయంలో 117 మందిని పరీక్షించారు. హాజరైన వారిలో 111 మంది అంటే 95 శాతం మంది ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ 111 మందిలో 89 శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నా 85 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. వీరిలో ఎనిమిది రకాల కొవిడ్ లక్షణాలున్నట్లు తేల్చారు. దగ్గు, ముక్కునుంచి నీరుకారడం, అలసట, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, తుమ్ములతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు తమకేం కాదనే భ్రమలో ఉండొద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని తమ అధ్యయనం సూచిస్తోందని పరిశోధకులు అంటున్నారు.