క్యాన్బెరా: ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరమైన సిడ్నీలో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేశాయి. 107 రోజుల లాక్డౌన్ తర్వాత ఇవాళ మళ్లీ ఆ నగరంలో షాపులన్నీ తెరుచుకున్నాయి. హెయిర్ డ్రెస్సెర్స్, జిమ్లు, కేఫ్లు, బార్లను ఓపెన్ చేశారు. అయితే కేవలం వ్యాక్సినేట్ అయిన కస్టమర్లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో 70 శాతం జనాభా వ్యాక్సినేట్ అయ్యారు. 16 ఏళ్లు దాటిన వారందరూ వ్యాక్సినేట్ అయినట్లు తెలుస్తోంది. జనం ఎగబడడంతో ఆదివారం అర్థరాత్రి నుంచే కొన్ని వ్యాపార సముదాయాలను తెరిచారు. మహమ్మారి కరోనా ఆంక్షలును ఇప్పటికే 80 శాతం ఎత్తివేశారు. గత ఏడాది మార్చిలో న్యూ సౌత్ వేల్స్ నివాసితులకు విదేశీ ప్రయాణంపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు వాళ్లు విదేశాలకు ప్రయాణం చేయవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతోందని, హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోందని న్యూ సౌత్ వేల్స్ నేత డామినిక్ తెలిపారు.