Hamid Karzai: తాలిబన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నది. దేశంలో మహిళలు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లు తాలిబన్లు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. దేశంలో అందరినీ తుపాకులు ఎక్కుపెట్టి దారిలోకి తెచ్చుకుంటున్న తాలిబన్లకు పంజ్షీర్పై పట్టుబిగించడం మాత్రం చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే పంజ్షీర్లోని తిరుగుబాటు దళాలు తాలిబన్లను తమ ప్రాంతంలో అడుగుపెట్టనీయడంలేదు.
దాంతో రెండు వైపుల బలగాల మధ్య గత కొన్నిరోజులుగా యుద్ధం కొనసాగుతున్నది. ఇరువైపుల ప్రాణ నష్టం కూడా భారీగానే జరుగుతున్నది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కీలక ప్రకటన చేశారు. రెండు వర్గాలు వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని, సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన టోలో న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది.