కొలంబో, జూన్ 16: శ్రీలంకలో ఇంధన సంక్షోభానికి మరొకరు బలయ్యారు. కొలంబోలో డీజిల్ కోసం ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రంతా లైన్లో ఉండి గుండె పోటుతో చనిపోయాడు. శ్రీలంకను కొన్ని నెలలుగా ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తున్నది. పెట్రోల్ కోసం బంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు.
రోజుల తరబడి లైన్లలో నిలబడలేక వాహనాలను బంకుల దగ్గరే వదిలేసి వెళ్లిపోతున్నారు. శ్రీలంకలో పెట్రోల్ కోసం లైన్లో నిలబడి చనిపోవడం ఇదే తొలిసారి కాదు. గడిచిన రెండు నెలల కాలంలో కనీసం నలుగురు చనిపోయా రు. వంటగ్యాస్ గోసం లైన్లో నిలబడి బుధవారం 64 ఏండ్ల వృద్ధుడు మరణించాడు.