కొలంబో : ఆర్థిక సంక్షోభంతో పొరుగుదేశమైన శ్రీలంక అల్లాడిపోతున్నది. రోజు రోజుకు పరిస్థితులు దారుణంగా పరిస్థితులు దారణంగా తయారవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకరంగం దెబ్బతినడంతో సంక్షోభం మరింత ఉధృతమవుతున్నది. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీలంక స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. 5.9 శాతం మేర కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ పతనమైంది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నిలిపివేశారు.
ప్రధాన కంపెనీలు షేర్లన్నీ భారీగా నష్టపోయాయి. అరగంట పాటు ట్రేడింగ్ను నిలిపివేసినట్లు కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభానికి తోడు.. రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించింది. మరో వైపు లంక పార్లమెంట్ కేబినెట్ మంత్రులు 26 మంది రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. రాజీనామా చేసిన వారిలో ప్రధాని మహింద్ర రాజపక్స తనయుడు నమల్ రాజపక్స ఉన్నారు.