కొలంబో: దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో శ్రీలంకలో (Sri Lanka) రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరగుతున్న నిరసన కార్యక్రమాలను నిలువరించడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. అయితే దీనిపై స్వపక్షంలోనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాను నిషేధించడాన్ని తాను ఎప్పటికీ సమర్ధించనని ఆ దేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స అన్నారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవని చెప్పారు. అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచించాలని, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
I will never condone the blocking of social media. The availability of VPN, just like I’m using now, makes such bans completely useless. I urge the authorities to think more progressively and reconsider this decision. #SocialMediaBanLK #SriLanka #lka
— Namal Rajapaksa (@RajapaksaNamal) April 3, 2022
శ్రీలంకలో వెళ్లువెత్తుతున్న ప్రజా నిరసనలను నిలువరించడానికి సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశాలు జారీచేసింది. దీంతో దేశంలో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి.