ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షాలు సిద్ధం
కొలంబో, జూలై 11: ఈ నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారంటూ దేశ ప్రజలు చాలాకాలంగా నిరసనలు చేపట్టారు.
ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ అధికారిక నివాసాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. అంతకుముందే గొటబయ తప్పించుకుని పారిపోయి తలదాచుకున్న విషయం విదితమే. ఇంకా ఆయన అజ్ఞాతవాసంలోనే ఉన్నారు.కాగా, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.