న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తమిళనాడులోని తేనీకి చెందిన 31 ఏండ్ల భారతీయ-అమెరికన్ మహిళ వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నగర మేయర్ ప్రైమరీ బ్యాలెట్లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తి. రినీ సంపత్ వాషింగ్టన్ డీసీలో 2026 మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆమె తన ఎన్నికల ప్రచారంలో ప్రాథమిక అంశాలను సరిదిద్దండి అనే నినాదంపై దృష్టి సారించారు.
మెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ ఖర్చులు, మెరుగైన ప్రజా సేవలు అందిస్తానని వాగ్దానం చేశారు. అదే సమయంలో తనను తాను రాజకీయ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వ్యక్తిగా పరిచయం చేసుకుంటున్నారు. తేనీలో జన్మించిన రినీ తన ఏడవ ఏట అమెరికాకు వచ్చారు. దశాబ్దానికి పైగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. వృత్తిపరంగా ఆమె ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్తో పాటు సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు.