గాజా, నవంబర్ 18: హమాస్ను అంతమొందించడానికి దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తుండటంతో గాజాలోని అతిపెద్ద అల్-షిఫా దవాఖాన ఖాళీ అయ్యింది.
ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఈ దవాఖానను రోగులు, డాక్టర్లు, సిబ్బంది, యుద్ధం కారణంగా ఆశ్రయం పొందుతున్న పలువురు పాలస్తీనా పౌరులు శనివారం ఖాళీ చేసి పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లారు. పూర్తి అస్వస్థతతో, కదలలేని స్థితిలో ఉన్న రోగులు, వారికి సహాయకులుగా కొందరు సిబ్బంది మాత్రమే దవాఖానలో మిగిలారు.