Today History: స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారిలో షేక్ ముజీబుర్ రహ్మాన్ ఒకరు. 1971 లో సరిగ్గా ఇదే రోజున ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చారిత్రాత్మక ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ పిలుపునిచ్చారు. ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం వినేందుకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఈ ప్రసంగాన్ని ప్రపంచ వారసత్వ డాక్యుమెంటరీగా యూనెస్కో 2017 లో గుర్తించింది.
భారతదేశం నుంచి విడివడి ప్రత్యేక దేశంగా అవతరించిన పాకిస్థాన్లో ఉండలేమని, తమకు కూడా స్వాతంత్య్రం కావాలంటూ బంగ్లాదేశ్కు చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్ మరో ఉద్యమానికి సమర శంఖం ఊదారు. ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్ను స్థాపించుకుందాం అంటూ సరిగ్గా 51 ఏండ్ల క్రితం ఆయన పిలుపునిచ్చిన ప్రసంగం చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. పాకిస్థాన్ సైన్యం నుంచి రక్షణ కోసం కాకుండా ప్రతిఘటనకు ప్రతీకగా వెదురు కర్రలు చేతబూని ప్రజలు బహిరంగసభకు హాజరయ్యారు. షేక్ ముజీబుర్ ప్రసంగంలోని ప్రతి వాఖ్యం పాకిస్థాన్కు సవాలుగా నిలిచింది. ఈ ప్రసంగం భారత ఉపఖండంలో ఇచ్చిన అన్ని రాజకీయ ప్రసంగాలలో అత్యున్నతమైనదిగా నిలిచింది.
ఇది జరిగిన 16 రోజులకు ఆపరేషన్ సెర్చ్లైట్ను పాకిస్థాన్ ప్రారంభించింది. పాక్ సైన్యం షేక్ ముజీబుర్ రహ్మాన్ను అరెస్టు చేసి పాకిస్థాన్కు తీసుకెళ్లింది. దీనిపై బంగ్లాదేశ్ అంతటా అట్టుడికిపోయింది. కొన్ని నెలలపాటు పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం.. బంగ్లా ఉద్యమంలో కీలకంగా ఉన్న ముక్తి వాహినికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నది. దాంతో భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. అయితే, కేవలం 13 రోజుల్లో భారత్కు మోకరిల్లి పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య రాజ్యంగా అవతరించింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..