Titanic Sub | అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల సబ్ మెరైన్ గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి బయల్దేరిన మినీ జలాంతర్గామి ‘టైటాన్’ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆ సబ్మెర్సిబుల్ టైటాన్(Titanic Sub) కోసం కెనడా, అమెరికాకు చెందిన రక్షణ బృందాలు మూడు రోజులుగా సముద్రం అంచున పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నాయి. దాదాపు 20వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రాన్ని అన్వేషిస్తున్నాయి.
ప్రస్తుతం గాలింపు చర్యలు కీలక దశకు చేరుకున్నాయి. సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ (Oxygen) సరఫరా కూడా మరికొన్ని గంటల్లో అయిపోయే అవకాశం ఉంది. అందులో ఉన్న ఐదుగురికి కేవలం మూడు గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని సమాచారం. దీంతో అందులో ఉన్నవారు సజీవంగా బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.
1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓసియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు. అంటే మన కరన్సీ ప్రకారం రూ.2కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.
తాజాగా మిస్సైన టైటాన్ సబ్లో మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు సిబ్బంది కాగా, ముగ్గురు ప్రయాణికులు. బ్రిటీష్ బిలియనీర్ హమీశ్ హార్డింగ్తో పాటు పాకిస్థాన్కు చెందిన వ్యాపారవేత్త షెహజాద్ దావూత్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. ఓసియన్గేట్ చీఫ్ స్టాక్టన్ రష్తో పాటు ఫ్రెంచ్ సబ్మెరైన్ ఆపరేటర్ పౌల్ హెన్రీ నర్జేలెట్ కూడా ఆ సబ్లో ఉన్నారు.
Also Read..
Taffic Rules | ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ లో రికార్డు.. ఏకంగా 70 చలాన్లు అందుకున్న యూపీ వ్యక్తి
Couple Romance | బైక్ పై ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన యువ జంట.. వీడియో
Buddhadeb Bhattacharya | పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కుమార్తె