బీజింగ్: ప్లాస్టిక్తో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతున్నది. దీంతో పర్యావరణహిత ప్లాస్టిక్ తయారీలో చైనాలోని టియాంజిన్ యూనివర్సిటీ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. సాల్మాన్ అనే జాతి చేపల వీర్యం, వెజిటెబుల్ ఆయిల్ నుంచి సేకరించిన కొన్ని రసాయనిక పదార్థాలతో వినూత్న ప్లాస్టిక్ను అభివృద్ధి చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్యాకేజింగ్లో ఈ ప్లాస్టిక్ మెరుగ్గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీన్ని సులభంగా రీసైకిల్ చేయవచ్చని తెలిపారు.