కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇవాళ్టి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకోనున్నారు. స్కూళ్లు తెరుస్తున్నట్లు ఆదివారం ఆ నగర మేయర్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగినట్లు చదువును కొనసాగిస్తామని, విభిన్న ఎడ్యుకేషనల్ ఫ్లాట్ఫామ్స్ను వాడనున్నట్లు ఆయన వెల్లడించారు. పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా.. నగరంలో జీవించడం కొనసాగించాలని మేయర్ విటాలీ క్లిటచ్కో తెలిపారు. మనల్ని బెదిరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలవంతం కావన్నారు. దేశంలో ఉన్న సగం మంది చిన్నారులు ఇప్పటికే ఆ దేశాన్ని విడిచిన వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.