న్యూఢిల్లీ: దేశంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తుండటంతో అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మూలాలున్న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫొరెట్టి (Samantha Cristoforetti) భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి (ఇస్రో) ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ (ISA) నుంచి శుభాభినందనలు తెలిపారు. 2023లో ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్కు ఓ వీడియో సందేశం పంపించారు.
మానవులను అంతరిక్షంలో పంపించడానికి ఇస్రో మొదటిసారిగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ, నాసా, అంతర్జాతీయ భాగస్వాముల పక్షాన కోరుకుంటున్నానని చెప్పారు.
Sky is not the limit!
Good wishes from #space ISS @Space_Station as #India celebrates #75YearsofIndependence
Appreciate @AstroSamantha for the warm message. A true 🌎 p’ship @NASA @isro @esa
Delighted to share on birth anniv of #VikramSarabhai , father of 🇮🇳 space program pic.twitter.com/tT2OsoCjb4
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) August 12, 2022