న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెకర్ట్గా సైమా వాజెద్(Saima Wazed) ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూతురే సైమా వాజెద్. ఆ పోస్టు కోసం జరిగిన ఎన్నికల్లో ఆమె గెలిచారు. మొత్తం 11 దేశాలకు ఆ గ్రూపులో సభ్యత్వం ఉన్నది. బంగ్లాదేశ్, భూటాన్, కొరియా, ఇండియా, ఇండోనేషియా, మాల్దీవులు, నేపల్, శ్రీలంక థాయిలాండ్ దేశాలు ఢిల్లీలో జరిగిన ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సమావేశాలకు మయన్మార్ హాజరుకాలేదు. సైమాకు 8 ఓట్లు పోలవ్వగా, నేపాల్ అభ్యర్థి డాక్టర్ శంభూ ప్రసాద్ ఆచార్యకు రెండు ఓట్లు పోలయ్యాయి.
సైమా వాజెద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. మానసిక వైద్య నిపుణురాలిగా ఆమెను గుర్తిస్తారు. ఆటిజం కేసులకు చికిత్సను అందించడంలో ఆమె మేటి డాక్టర్. మెంటల్ హెల్త్ విషయంలో డబ్ల్యూహెచ్వో రీజినల్ డైరెక్టర్గా చేశారామె. అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆమె ఆ బాధ్యతలను చేపట్టనున్నది. అయిదేళ్ల పాటు ఆమె ఆ పోస్టులో కొనసాగుతారు.