కీవ్: ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్ వైపునకు వేగంగా దూసుకెళ్తున్నాయి. కాగా, రష్యా సైనికులు ఉక్రెయిన్ ఆర్మీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రష్యా సైనికులు ఉక్రేనియన్ ఆర్మీ యూనిఫాంలోకి మారారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఆరోపించింది. ‘ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన రెండు వాహనాలను రష్యన్ మిలిటరీ స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికులు ఉక్రేనియన్ యూనిఫాంలోకి మారి ఆ వాహనాల్లో కీవ్కు వెళ్తున్నారు. రష్యా ట్యాంకులు అనుసరిస్తున్నాయి’ అని ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ తెలిపారు. ఈ మేరకు కీవ్లోని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
మరోవైపు ఉక్రెయిన్ను చుట్టుముట్టిన రష్యా దళాలు అన్నివైపుల నుంచి ఆ దేశంలోకి దూసుకొస్తున్నాయి. రష్యా దళాలు ప్రధానంగా ఈశాన్య, రాస్ట్ నుంచి రాజధాని కీవ్ను సమీపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. కాగా, కీవ్కు వెలుపల రష్యా దళాలతో ఉక్రెయిన్ సైనికులు పోరాడుతున్నారని అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. శత్రువు తొలి టార్గెట్ తానేనని అన్నారు. రెండో టార్గెట్ తన కుటుంబం అని చెప్పారు.
రష్యా దళాలు దూసుకువస్తున్నప్పటికీ తాను కీవ్లోనే ఉంటానని జెలెన్స్కీ తెలిపారు. తన కుటుంబం కూడా కీవ్లోనే ఉందన్నారు. ఉక్రెయిన్ అధినేతను అంతం చేసి దేశాన్ని రాజకీయంగా నాశనం చేయాలని రష్యా కోరుకుంటున్నదని వీడియో సందేశంలో ఆయన ఆరోపించారు. రష్యాపై పోరాటంలో తాము ఒంటరైపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.