మాస్కో: భారత్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు ఎంతో ప్రతిభావంతులని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని శ్లాఘించారు. రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ప్రసంగిస్తూ.. ‘భారత్ను చూడండి. దేశ అభివృద్ధి కోసం కృషిచేసే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. దాదాపు 150 కోట్ల మంది జనాభాతో ఇప్పుడు భారత్ సమర్థ దేశంగా ఎదిగింది. అభివృద్ధిలో భారత్ కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని కొనియాడారు. భారత్కు మాదిరిగానే రష్యాకు విశిష్ట నాగరికత, సంస్కృతి ఉన్నాయని, రష్యాలో యూరోపియన్ సంస్కృతి కూడా మిళితమై ఉన్నదని తెలిపారు.