న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. మరో వైపు ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా బ్యారెల్కు 100 డాలర్ల మార్క్ను దాటింది. దాటింది. చేరింది. ఎనిమిదేళ్లలో మొదటిసారిగా బ్రెంట్క్రూడ్ ధర రికార్డు స్థాయికి చేరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై సైనిక చర్యకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ వెనక్కి తగ్గకుంటే యుద్ధం తప్పదని ఇప్పటికే హెచ్చరించారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని, లేకుంటే యుద్ధాన్ని నివారించలేమన్నారు. మధ్యలో కలుగజేసేకునేందుకు మరేదేశం వచ్చినా ప్రతీకారం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మూడో చమురు ఉత్పత్తిదారుగా రష్యా ఉండడంతో యుద్ధం నేపథ్యంలో ఇంధన ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని మార్కెట్లో భయాలు పెరిగాయి. రష్యా ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. ఐరోపా దేశాలు తమ చమురులో 20శాతానికిపైగా రష్యా నుంచి తీసుకుంటున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రాగి పదిశాతం, అల్యూమినియం పదిశాతం రష్యాలోనే ఉత్పత్తి అవుతున్నది. అంతేకాక సహజ వాయువు (నేచురల్ గ్యాస్)ను సైతం భారీగానే ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లో 10శాతం రష్యానే సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ముడి చమురు, సహజవాయువు సరఫరాపై ప్రతికూల ప్రభావంపడే అవకాశం ఉండడంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. ఐరోపాలో 40శాతం కంటే ఎక్కువ గ్యాస్ను రష్యానే సరఫరా చేస్తున్నది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ప్రత్యక్షంగా భారం పడనున్నది. సరఫరా తగ్గితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నది. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న క్రూడాయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్ల నుంచి 120 డాలర్లకు చేరే అవకాశం ఉందని ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 101.17 డాలర్లకు చేరింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. భారత్లోనూ యుద్ధం ప్రభావం ఉంటుందని తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో చమురు ధరలు పెరుగుతాయని పేర్కొంటున్నారు.