ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్తో శాంతి చర్చలు దండగ అని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావరోవ్ స్పందించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్తో శాంతి చర్చలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
మొదటిసారి ఆ దేశంతో చర్చలు జరిపినప్పుడే.. ఉక్రెయిన్ ఏ విషయంలోనూ నిజాయతీగా చర్చించాలని అనుకోవడం లేదని తమకు అర్తమైందని లావరోవ్ తెలిపారు. కీలకమైన వ్యక్తులు దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన విషయాలను వాళ్లు అర్థం చేసుకోలేరని మండిపడ్డారు.
ఆ విషయం తమకు అర్థమైందని, ఆ దేశంతో చర్చలన్నీ కూడా ఏప్రిల్లోనే ఆగిపోయాయన్నారు. అలాగే ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీగా ఆయుధాలు అందడాన్ని ఎత్తిచూపిన ఆయన.. దీంతో రష్యా లెక్కలు కూడా మారాయని, ప్రస్తుతం తాము కేవలం తూర్పు ఉక్రెయిన్ మీదనే ఫోకస్ పెట్టడం లేదని హెచ్చరికలు చేశారు.