మాస్కో: కొత్త ఏడాది వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. డిసెంబర్ 31న రష్యా ఆక్రమిత ప్రాంతమైన డొనెస్క్లోని చిన్న పట్టణమైన మాకివ్కాపై ఉక్రెయిన్ దళాలు విరుచుకుపడ్డాయి. రష్యన్ సైనికుల శిబిరమైన వొకేషనల్ కాలేజీ బిల్డింగ్పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడిచేసిన విషయం తెలసిందే. ఈ ఘటనలో 300 నుంచి 400 మంది ప్రత్యర్థి సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఆ దాడిని దృవీకరించిన రష్యా రక్షణ శాఖ.. మొదట 63 మంది సైనికులు మృతిచెందారని తెలిపింది.
కాగా, ఆ ఘటనలో 89 మంది సర్వీస్ మెన్ మృత్యువాతపడ్డారని తాజాగా క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి ప్రధాన కారణం.. బిల్డింగ్లో ఉన్న సైనికులు అనుమతి లేకుండా మూకుమ్మడిగా సెల్ఫోన్లను వినియోగించడమేనని తెలిపింది. అమెరికా సెల్ఫోన్లను ట్రాక్ చేసిన ఉక్రెయిన్ దళాలు.. రష్యా సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డాయని చెప్పింది. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది.