కీవ్: ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది. తొలుత రష్యా వాయుసేన సెంట్రల్ కీవ్లో మంత్రులు నివసించే భవనం లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్.. రష్యాలో బ్రయాన్స్లోని డ్రుజ్బా చమురు పైపులైన్పై దాడి చేసింది. రెండు దేశాలు కూడా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరుపుకున్నాయి.
ఈ దాడిలో ఇతర ఉక్రెయిన్ నగరాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంది. క్రెమెన్చుక్లో డజన్ల కొద్దీ విద్యుత్ సౌకర్యాలు రష్యా దాడితో దెబ్బతిన్నాయి. అలాగే అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమైన క్రివీరిహ్లో కూడా క్షిపణులు రవాణా, మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇదొకటి.