కీవ్ నగరంలోని ఓ టీవీ టవర్పై రష్యా బాంబు దాడులు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. రష్యా పౌరులు, కొన్ని ప్రభుత్వ సంస్థలపై సమాచార దాడులను అరికట్టడానికే ఈ దాడులు అని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ భద్రతా దళాల హెడ్క్వార్టర్లపై దాడులు చేస్తామని రష్యా కొన్ని గంటల ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. టీవీ టవర్పై దాడులు చేయడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తొందరగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
రష్యాలోని ప్రధాన నగరాలే టార్గెట్గా రష్యా ఉదయం నుంచీ దాడులు చేస్తూనే వుంది. ఖార్కీవ్లోని ప్రభుత్వ బిల్డింగ్పై మిస్సైల్తో దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇక పౌర నివాసాలపై కూడా దాడులకు దిగుతోంది.