గోదావరిఖని, జూలై 11: సింగరేణి కార్మికు హక్కుల పరిరక్షణ టీబీజీకేఎస్తోనే సాధ్యమవుతుందని సీనియర్ నా యకుడు కెంగర్ల మల్లయ్య అన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కార్మికుల కోరిక మేరకే తాను మళ్లీ టీఆర్ఎస్లోకి వచ్చినట్టు చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో అందరితో కలిసి పని చేస్తానని తెలిపారు. సింగరేణి సంస్థకు పునరుజ్జీవం పోస్తూనే కార్మికుల అభ్యున్నతికి పాటుపడుతున్న యూనియన్ ఒక్క టీబీజీకేఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తన చేరికకు సహకరించిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.