ఇస్తాంబుల్: ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ చర్చల్లో రష్యాకు చెందిన బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ కనిపించారు. చెల్సీ ఫుట్బాల్ క్లబ్ ఓనర్ అయిన అబ్రమోవిచ్.. పుతిన్కు కూడా సన్నిహితుడే. నిజానికి రోమన్ అబ్రమోవిచ్పై రెండు రోజుల క్రితం విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ జరుగుతున్న శాంతి చర్చలకు సంబంధించిన వీడియోను టర్కిష్ మీడియా రిలీజ్ చేసింది. అధ్యక్షుడు ఎర్డగాన్ ప్రతినిధి ఇబ్రహీం పక్కన అబ్రమోవిచ్ కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. ఆయన ట్రాన్స్లేషన్ హెడ్ఫోన్స్తో చర్చల్లో పాల్గొన్నారు. కానీ రెండు దేశాల ప్రతినిధులు కూర్చున్న ప్రధాన టేబుల్ వద్ద అతని లేడని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న చర్చలను ఫలప్రదం చేసేందుకు అబ్రమోవిచ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. రష్యా అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలో ఎవరు కూడా ఏదీ తినవద్దు, తాగొద్దు అని చెప్పారు. ఏ వస్తువులను కూడా తాకవద్దు అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. బెలారస్ బోర్డర్లో చర్చలు జరుగుతున్న సమయంలో రష్యా బిలియనీర్ రోమన్పై విష ప్రయోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ వార్నింగ్ ఇచ్చారు. చర్చల్లో డినాజిఫికేషన్ డిమాండ్ను రష్యా వదులుకున్నట్లు తెలుస్తోంది.