కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో చివరిరోజు మంగళవారం ప్రచారం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఇంటింటి ప్రచారానికే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రాధాన్యత ఇచ్చారు. గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ అధిక మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో గులాబీశ్రేణులు పనిచేస్తున్నాయి. – కొత్తూరు, ఏప్రిల్ 27
కొత్తూరు, ఏప్రిల్ 27 : కొత్తూరు మున్సిపాలిటీలో చివరి రోజూ మంగళవారం ప్రచారం జోరుగా సాగింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. కొవిడ్ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు.
1వ వార్డులో కుమ్మరి పార్వతమ్మ తన భర్త భిక్షపతితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. 2వ వార్డు అభ్యర్థి చంద్రకళ రాజేందర్ ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని కోరారు. వారి వెంట లక్ష్మీనారాయణగౌడ్ ఉన్నారు. ఇక 3వ వార్డు అభ్యర్థి కొస్గి శ్రీను, సోలిపూర్ శ్రీశైలం, చేగూర్ విఠల్తో కలిసి ప్రచారం నిర్వహించరు. 4వ వార్డు అభ్యర్థి గోవింద్ నాయక్ మహిళలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. 5వ వార్డు అభ్యర్థి హైమావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట నర్సింహాగౌడ్, కొత్తూరు జడ్పీటీసీ మధుసూదన్రెడ్డి ఉన్నారు. 6వ వార్డులో అభ్యర్థి సరస్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వెంకటేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి ఉన్నారు. 7వ వార్డులో అభ్యర్థి జంగమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వారి వెంట జనార్దనచారి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఉన్నారు. ఇక 8వ వార్డులో అభ్యర్థి లావణ్య ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట దేవేందర్యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ ఉన్నారు. 9వ వార్డులో గోవింద్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట కొందుర్గు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి ఉన్నారు. 10 వార్డులో అభ్యర్థి కరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్గౌడ్, మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్రావు ఉన్నారు. 11 వార్డులో ప్రసన్నలేఖ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, గుర్రంపల్లి కృష్ణ ఉన్నారు. 12 వార్డులో డోలి రవీందర్ ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రోజుకు రెండు, మూడు చొప్పున అన్ని వార్డుల్లో తిరిగి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరును కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. సభలు, సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించాలని సూచించారు.