యూకేలో వరుసగా 50 మందికిపైగా మంత్రులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, ప్రధానిని కొత్త ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రధాని రేసులో తాను ఉన్నట్లు భారత సంతత వ్యక్తి, బోరిస్ జాన్సన్ కేబినెట్లో మంత్రి రిషి సునక్ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రిషి సునక్ పేరు మార్మోగిపోతున్నది. కాగా, రిషి సునక్ భార్య మల్టీ మిలియనీర్ అక్షతామూర్తి ఆమె నివాసం వెలుపల వేచి ఉన్న జర్నలిస్టులకు ఖరీదైన కప్పుల్లో టీ అందించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లండన్లోని వారి ఇంటి వెలుపల జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు మూర్తి.. టీ, బిస్కెట్లు అందిస్తున్న ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను స్కై న్యూస్కి చెందిన జోష్ గఫ్సన్ షేర్చేశారు. “చాలా దయతో ఇంటి బయట వేచిచూస్తున్న మాకు టీ, బిస్కెట్లు తెచ్చిపెట్టినందుకు ధన్యవాదాలు! టీ చాలా బాగుంది.” అని జోష్ గఫ్సన్ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరికొందరు ఈ ఫొటోలు, వీడియోలను కూడా ట్వీట్ చేశారు. ఆమె టీ తెచ్చిన కప్పులు ఎమ్మా లాసీ అనే బ్రాండ్కు చెందినవని, ఒక్కొక్కటి 38 పౌండ్లు అని మరికొందరు ట్వీట్ చేశారు.
Big thanks to @RishiSunak’s wife who very kindly brought us tea and biscuits outside his house!
P.S. It was very good tea. pic.twitter.com/VLxasWqf71
— Josh Gafson (@JoshGafson1) July 6, 2022
No sign of former chancellor Rishi Sunak at his place earlier, but his wife Akshata Murty brought out brews and biscuits for the press pic.twitter.com/PIFFuevpdv
— Lucas Cumiskey (@lucas_cumiskey) July 6, 2022