న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్(CJI D Y Chandrachud) కంగ్రాట్స్ తెలిపారు. ఎస్సీబీఏ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నామని, మీ సహకారం కోసం ఎదురుచూస్తున్నామని సీజేఐ తెలిపారు. సీజేకి కూడా సిబల్ థ్యాంక్స్ చెప్పారు. 22 ఏళ్ల తర్వాత బార్ అసోసియేషన్కు పనిచేసే అవకాశం తనకు దక్కినట్లు ఆయన చెప్పారు. మీకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సిబల్ పేర్కొన్నారు. గురువారం సిబల్ ఎన్నిక జరిగింది.
సిబల్తో పాటు సీనియర్ న్యాయవాదులు ఆదిశ్ అగర్వాలా, ప్రదీప్ కుమార్, ప్రియా హింగోరాని, అడ్వకేట్ త్రిపురారి రే, నీరజ్ శ్రీవాత్సవ్లు బార్ అసోసియేషన్ అద్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో సిబల్కు వెయ్యి కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ప్రదీప్ కుమార్ రాయ్కి 650 ఓట్లు పడ్డాయి. హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేట్ అయిన సిబల్ 1989-90 సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్గా చేశాడు. 1983లో సీనియర్ అడ్వకేట్గా బాధ్యతలు చేపట్టారు. 1995 నుంచి 2002 వరకు యూపీఏ సర్కారులో మూడు సార్లు ఎస్సీబీఏ అధ్యక్షుడిగా కూడా చేశారు.