జెరూసలెం : గాజా స్ట్రిప్పై వేలాది సైనికులతో విరుచుకుపడి హమాస్ (Hamas Attack) ప్రస్తుత నాయకత్వాన్ని కూలదోసేందుకు ఇజ్రాయెల్ సైన్యం కసరత్తు సాగిస్తోంది. హమాస్ ఉగ్రసంస్ధ అగ్ర సైనిక, రాజకీయ నాయకత్వాన్ని పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నదని న్యూయార్క్ టైమ్స్ ఆదివారం పేర్కొంది.
హమాస్ ప్రాబల్య కేంద్రమైన గాజా సిటీని స్వాధీనం చేసుకున్న అనంతరం ఇజ్రాయెల్ తదుపరి చర్యలు ఏమిటనే దానిపై అనిశ్చితి నెలకొంది. శక్తివంతమైన క్షిపణులు, పెద్దసంఖ్యలో బలగాలను కలిగి ఇరాన్ మద్దతుగల లెబనీస్ మిలీషియా అయిన హమాస్ మిత్రపక్షం హిజ్బులా గాజాపై దాడికి ఎలా ప్రతిస్పందిస్తుందనే విషయంలో కూడా అస్పష్టత ఉందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.
గాజాపై తమ సైనికులు దండయాత్ర వార్తలను ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకూ అధికారికంగా ధ్రువీకరించలేదు. భూతల యుద్ధానికి తమ సేనలు సన్నద్ధంగా ఉన్నాయని ఐడీఎఫ్ చెబుతోంది. కాగా, గాజా స్ట్రిప్లో హమాస్పై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇప్పటివరకూ 2329 మంది ప్రాణాలు కోల్పోగా 9000 మందికి పైగా గాయపడ్డారు.
Read More :
CM KCR | హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తాం : సీఎం కేసీఆర్