న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పెన్షన్ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. పెన్షన్ రంగంలో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది. ఈ పరిమితిని పెంచాలంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటు ఇదే సవరణ బిల్లు ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్టును(ఎన్పీఎస్ ట్రస్టు) పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేయనున్నట్టు తెలుస్తున్నది. దీనిని కంపెనీల చట్టం పరిధిలోకి తెచ్చి 15 మంది సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అసంఘటిత రంగంలో ఉన్నవారికి కూడా మెరుగైన పెన్షన్ ఫలాలు అందడం కోసం ఈ నిర్ణయం తీసుకొన్నారు.