టెహ్రాన్: ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. (Iran Seizes Israeli Ship) గల్ఫ్లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన కంటైనర్ షిప్ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. ఎంసీఎస్ ఏరీస్ పేరున్న కంటైనర్ షిప్ను ఇరాన్ నేవీ స్పెషల్ ఫోర్సెస్ అయిన సెపా గార్డ్స్ హెలికాప్టర్ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. యూఏఈ తీరంలోని హార్ముజ్ జలసంధి సమీపం నుంచి ఈ కార్గో షిప్ను ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్ కమాండోలు హెలికాప్టర్ నుంచి రోప్ ద్వారా కంటైనర్ షిప్పైకి దిగిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఇరాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జరిగిన ఈ సంఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత తీవ్రం చేస్తున్న ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది.
⚡Iran seizes an Israeli-owned ship🔥 pic.twitter.com/t7KRBiQpam
— Nadira Ali🇵🇸 (@Nadira_ali12) April 13, 2024