టొరంటో: కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మిస్సిసాగలోని రామ మందిరం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలేశారు. టొరంటోలో ఉన్న భారతీయ కౌన్సులేట్ ఈ ఘటనను ఖండించింది. సరైన చర్యలు తీసుకోవాలని కౌన్సుల్ జనరల్ ఆ దేశాన్ని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కెనడా సర్కార్ను కోరినట్లు కౌన్సులేట్ తన ట్వీట్లో తెలిపింది.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
మోదీని టెర్రరిస్టుగా డిక్లేర్ చేయాలని (బీబీసీ) రాశారు. సంత్ బింద్రావాలా అమరుడు.. హిందుస్తాన్ ముర్దాబాద్ అని ఆలయ గోడలపై రాశారు. ఇది విద్వేష దాడి అని, దీన్ని సీరియస్గా తీసుకోవాలని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ తెలిపారు.