ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసనకు (Protests in POK) దిగారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. విద్యుత్ బిల్లులను దహనం చేశారు. పీవోకేలో మొదలైన ఈ నిరసనలు పాకిస్థాన్ అంతా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వార్ ఉల్ హక్ కాకర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతున్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులను భారీగా పెంచారు. 300 యూనిట్ల విద్యుత్ వినియోగానికి సుమారు రూ.15,000 వరకు విద్యుత్ బిల్లులను జారీ చేశారు.
కాగా, విద్యుత్ బిల్లులను భారీగా పెంచడంపై పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు నిరసనకు దిగారు. విద్యుత్ బిల్లులను దహనం చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. అధిక బిల్లులతో తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దంటూ మసీదుల్లోని మైకుల్లో ఎనౌన్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ నెల 3న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో మొదలైన విద్యుత్ బిల్లులపై నిరసనలు ప్రస్తుతం ఆ దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. పలు నగరాల్లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వార్ ఉల్ హక్ కాకర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.