ఇస్లామాబాద్: పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్ రానున్నారు. ఆర్మీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలైనట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. నవంబర్ 25వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన చెప్పారు. రేసులో అయిదారు మంది టాప్ జనరల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బాజ్వా పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 29వ తేదీన జావెద్ బాజ్వా రిటైర్ కానున్నారు. టాప్ జనరల్స్ జాబితాను పీఎంవోకు పంపనున్నట్లు రక్షణశాఖ తెలిపింది.