కార్తిక్త్న్రం, నవీన్చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలు. మార్చి 26న ‘ఆహా’ ఓటీటీ యాప్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘1950 నుండి 2003 కాలం వరకు సాగే కథ ఇది. భారతీయ ప్రజాస్వామ విధానం పట్ల ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది? ప్రజాస్వామ్య ఫలాల్ని ప్రజలు వినియోగించుకుంటున్నారా?దుర్వినియోగం చేస్తున్నారా?అనే అంశాలకు ప్రేమకథను జోడించి రూపొందించాం. రాజకీయం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రేమ కోసం జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిని వరించిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ‘ఆహా’ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళుతుండటం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. సాయికుమార్, సుహాస్, పవిత్రాలోకేష్, శుభలేఖసుధాకర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:నోఫెల్రాజ.