PoK : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో.. ‘ది జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)’ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది. రావల్కోట్ (Raval Kote) నుంచి ముజఫరాబాద్ (Muzaffarabad) వరకు వేలాది మంది నిరసనకారులు లాంగ్ మార్చ్ (Long March) చేపట్టారు.
పీవోకే (PoK) లో పాకిస్థాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఆ నేతల అకృత్యాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పీవోకేలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది.