సిడ్నీ : ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ వార్నింగ్ రావడం కలకలం రేపుతున్నది. జూలై 9న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’ అనే పోస్టుతో ప్రమోషన్ చేస్తున్నారు.
ఈ పోస్టు కింద అబు ముస్తఫా అనే ఐడీ నుంచి ఓ బెదిరింపు కామెంట్ వచ్చింది. ‘స్టేడియం పైకప్పు మూసి ఉంటే బెటర్. లేదంటే అతను తన చావు కోసమే ఆస్ట్రేలియా వస్తాడు’ అని ఆ కామెంట్లో ఉంది. దీనిపై మెల్బోర్న్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఐపీ అడ్రస్ను గుర్తించినట్టు తెలుస్తున్నది.