బీజింగ్: చైనాకు చెందిన ఒక విమానం కూలింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది. చైనా విమానం కూలిన ఘటనలో ఎంత మంది మరణించి ఉంటారన్నది తెలియరాలేదు. అయితే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి చెందిన బంధువులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.11 గంటలకు కున్మింగ్ నుండి గ్వాంగ్జౌకి చైనా విమానం బయలుదేరింది. సాయంత్రం 3.05 గంటలకు గమ్యస్థానం చేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2.22 గంటలకు రాడార్ నుంచి విమానం మాయమైనట్లు ఫ్లైట్ డేటా ద్వారా తెలిసింది. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ఉండి 376 నాట్ల వేగంతో ప్రయాణించినట్లు ఫ్లైట్ డేటా ప్రకారం తెలుస్తున్నది.
మరోవైపు 2010లో చైనాలో కూలిన విమాన ప్రమాదంలో అందులోని 96 మందిలో 44 మంది మరణించారు. హెనాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం యిచున్ విమానాశ్రయానికి చేరుకుంటుండగా ఈ ఘటన జరిగింది.
A China Eastern Airlines Boeing 737-800 operating flight MU5735 has reportedly crashed near Wuzhou in southern China. Initial reports say 133 onboard.pic.twitter.com/iipgQYGkhK
— WLVN Analysis🔍 (@TheLegateIN) March 21, 2022
【Crash site】A Boeing 737 passenger plane carrying 133 people from China Eastern Airlines had an accident in Teng County, Guangxi and then triggered a mountain fire. At present, the rescue team has gathered, the casualties are still unknown. pic.twitter.com/udlT6qqKWZ
— 豆腐Toufu.exe🀄️ (@y1499003) March 21, 2022